హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కె చంద్రశేఖరరావు, చంద్రబాబులపై ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ గురువారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్ తెలంగాణకు చెందిన కాంగ్రెసు నేతలను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెసు కెసిఆర్ అనుకున్నట్టు ఏమాత్రం బలహీనంగా లేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు తెలంగాణ ఆకాంక్ష మేరకు పోరాడుతున్నారని స్పష్టం చేశారు. కెసిఆర్ ను ఓ పార్టీ నాయకుడిగా, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న నేతగానే దీక్షకు పిలిచామన్నారు. కానీ మాకు నేతృత్వం వహించాలని చెప్పి పిలవలేదని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గుంటూరులో ఏర్పాటు చేస్తున్న రైతుకోసం బహిరంగ సభ ఓ రాజకీయ డ్రామాగా కొట్టి పారేశారు. రైతులను నమ్మించడానికి టిడిపి రాజకీయ షోకు పూనుకున్నదన్నారు. వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు రైతుల కోసం పోరాడుతున్నారంటే రైతులు నమ్మే స్థితిలో లేరన్నారు. రైతులపై బాబుది ముసలి కన్నీరన్నారు. తనపై ఉన్న అపవాదును పోగొట్టుకోవడానికి ఆయన రైతుల కోసమంటూ గళమెత్తుతున్నారన్నారు.

కాగా తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా వచ్చినా రాష్ట్రంలోని ప్రజలందరూ సంయమనంతో ఉండాలని ఆయన కోరారు. కమిటీ నివేదిక ఎలా వచ్చినా అనవసర ఉద్రేకాలకు లోనుకావద్దని సూచించారు. అనుకూలంగా లేదని భావిస్తే శాంతిమార్గంలో మన ఆకాంక్షను తెలియజేద్దామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X