వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో జగన్ ఓదార్పు యాత్ర: మంత్రులతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా మంత్రులతో గురువారం ఉదయం సమావేశమయ్యారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి వైయస్ జగన్ విశాఖపట్నం జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా ఇంచార్జీ మంత్రి వట్టి వసంత కుమార్, జిల్లా మంత్రి బాలరాజులతో సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేశారు.

జగన్ ఓదార్పు యాత్రకు శాసనసభ్యులు వెళ్లకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించినట్లు సమాచారం. వైయస్ జగన్ తో పాయకరావు పేట శాసనసభ్యుడు బాబూరావు వెళ్లే అవకాశం ఉందని మంత్రులు ముఖ్యమంత్రికి తెలిపినట్లు సమాచారం. వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి సహకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ ఓదార్పు యాత్రను విఫలం చేసేందుకు జిల్లా మంత్రులు విశాఖపట్నం కాంగ్రెసు నాయకులు, శాసనసభ్యులతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X