మళ్లీ వైయస్ జగన్ ఢిల్లీ దీక్షకు పోటీగా చంద్రబాబు ధర్నా

దీంతో దానికి ముందే చంద్రబాబు కార్యరంగంలోకి దిగుతున్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన ఢిల్లీలో ధర్నా చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీన్ని అఖిల పక్ష ధర్నాగా తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఈ మేరకు బుధవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుగుదేశం ప్రకటించింది. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై సంతకాల సేకరణ జరపాలని కూడా నిర్ణయించినట్లు తెలిపింది.
కాగా, రైతు సమస్యలపై గత నెల 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు వైయస్ జగన్ విజయవాడలో 48 గంటల నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించగానే తాను 17వ తేదీన నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తానని చంద్రబాబు ప్రకటించారు. కాగా, ఈ విషయంలో తామంటే తాము ముందు నిర్ణయం తీసుకున్నామని ఇరు వర్గాలు పోటీ ప్రకటనలు ఇచ్చుకున్నాయి. చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేయగా, జగన్ 48 గంటల దీక్ష చేశారు. తాను ఈ నెల 11వ తేదీ ఢిల్లీలో ఒక్క రోజు దీక్ష చేస్తానని జగన్ రెండు రోజుల క్రితం విశాఖపట్నం జిల్లా ఓదార్పు యాత్రలో ప్రకటించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications