వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నార్త్‌ బ్లాక్‌ కు చేరుకున్న అఖిలపక్షం: కాసేపట్లో చిదంబరంతో భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యుఢిల్లీ: కేంద్ర హోంమంత్రి చిదంబరం గురువారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రం నుండి 5 పార్టీలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోని నార్త్‌బ్లాక్ కార్యాలయానికి చేరుకున్నాయి. హోంమంత్రి చిదంబరం వారితో భేటీ కానున్నారు. వారికి శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఇచ్చి అధ్యయనానికి రెండు వారాలు గడువు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో గుర్తింపు పొందని ఎనిమిది పార్టీలనుండి అయిదు పార్టీలో అఖిలపక్షంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లాయి. మిగిలిన మూడు పార్టీలు అఖిలపక్షాన్ని బహిష్కరించాయి.

భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు చిదంబరం ఆహ్వానాన్ని తిరస్కరించారు. పార్టీకి ఇద్దరిని పిలవడం సరికాదంటూ వారు అఖిలపక్షాన్ని బహిష్కరించారు. అయితే రాని వారికి స్పీడు పోస్టులో నివేదిక పంపిస్తామని చిదంబరం ప్రకటించారు. అఖిలపక్షానికి కాంగ్రెస్ నుండి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కావూరి సాంబశివరావు, ప్రజారాజ్యం నుండి సి. రామచంద్రయ్య, ఎంఐఎం నుండి అక్బరుద్దీన్, పాషా ఖాద్రీ, సిపిఎం నుండి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, సిపిఐ నుండి గుండా మల్లేషం, నారాయణ వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X