శ్రీ వెంకటేశ్వర స్వామి బంగారు రథం గొడుగు చోరీ
పటిష్ఠంగా ఉన్న రేకులను మండపం దక్షిణ వైపున ఓ రేకును కత్తిరించి ఆగంతుకులు లోనికి ప్రవేశించారు. వాహనంపైనున్న గొడుగును అపహరించారు. మండపానికి రంధ్రం ఉన్న విషయాన్ని మఠం నిర్మాణ పనులు చేస్తున్న కొందరు భవన నిర్మాణ కార్మికులు గుర్తించి నిఘా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న దేవస్థానం జేఈవో కె.భాస్కర్ తదితరులు రథ మండపాన్ని పరిశీలించారు. చోరీ సంఘటనను తెలుసుకుని నిఘా వైఫల్యంపై జేఈవో అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు.
Comments
Story first published: Thursday, January 6, 2011, 9:00 [IST]