వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఎగిరి గంతేసిన లగడపాటి రాజగోపాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై నియమించిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను నిష్పక్షపాతంగా అందించిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం వ్యాఖ్యానించారు. అభివృద్ధి, వెనుకబాటు ప్రాంతీయవారిగా కాకుండా జిల్లాల వారిగా ఉందని చెప్పడం శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని పార్టీల, అన్ని వర్గాల, ప్రజలందరి అభిప్రాయాలను వారు సేకరించారన్నారు. వారు సేకరించిన సమాచారంతో సరియైన నివేదికను తయారు చేసి కేంద్రానికి సమర్పించారని చెప్పారు.

కమిటీ నిర్ణయం హర్షదాయకమన్నారు. ఇప్పటికైనా తెలుగుతల్లీ కన్నీళ్లు తుడిచి సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను ముడి వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడా తమ నివేదికను ఆ కోవలోనే ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X