వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ నరసింహన్ ‌పైనే ఆధారపడిన కాంగ్రెసు హైకమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Narasimhan
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై కాంగ్రెసు అధిష్టానం పూర్తిగా గవర్నర్ నరసింహన్‌పైనే ఆధారపడినట్లు అర్థమవుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, ఇతర యంత్రాంగమంతా నామమాత్రమేనని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం జరిగిన కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో గవర్నర్ నరసింహన్ పాల్గొని రాష్ట్ర పరిస్థితిపై వివరించారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికపై వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు నిర్వహించాలని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ అభిప్రాయపడింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రభావం, తదనంతర పరిణామాలపై చర్చించారు. ఇందులో త్వరపడాల్సిందేమీ లేదని, కమిటీ సిఫార్సులపై క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మన్మోహన్ ‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సోనియా గాంధీ, ప్రణబ్‌ ముఖర్జీ, ఏకే ఆంటోనీ, చిదంబరం, అహ్మద్‌ పటేల్‌ హాజరయ్యారు.

నివేదికపై వివిధ పార్టీలతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టాలని, తద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వం ముందు ఇందుకోసం ప్రత్యేక గడువేమీలేదని, వచ్చేనెల చివర్లో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయని, అప్పటికల్లా ఒక నిర్ణయానికి రావచ్చని నేతలు భావిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను విడుదల చేసిన సందర్భంగా తలెత్తే పరిణామాలపై చర్చించేందుకు రాష్ట్ర గవర్నర్‌ ఎల్‌.నరసింహన్‌ కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ నేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఆంధప్రదేశ్‌ వ్యవహారాల గురించి, శాంతిభద్రతల గురించి చర్చించేందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన 30 నిమిషాలపాటు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యులైన రక్షణ మంత్రి ఏకే ఆంటోనీతో కూడా ఆయన భేటీ అయ్యారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఆయన శనివారం మధ్యాహ్నం తర్వాత భేటీ అవుతారు. ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, హోం మంత్రి చిదంబరంలతో ఆయన గురువారం రాత్రి సమావేశమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X