వైయస్ జగన్ పార్టీ పేరు రాజన్న రాజ్యం, ఆంగ్ల ప్రకటన వెల్లడి

YS Rajasekhar Reddy
హైదరాబాద్: కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్థాపించబోయే పార్టీ పేరు దాదాపు ఖరారైంది. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రతిబింబించేలా పార్టీకి 'రాజన్న రాజ్యం పార్టీ' (ఆర్ఆర్‌పీ) అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. దీనిని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించేందుకు వైఎస్ తోడల్లుడు, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి దరఖాస్తు చేశారు. పార్టీ పేరు పట్ల ఎవరికైనా అభ్యంతరాలుంటే పది రోజుల్లో ఎన్నికల సంఘానికి తెలియజేయాలని దినపత్రికల్లో ఆయన ప్రకటన ఇచ్చారు.

పార్టీ కార్యాలయంగా తన ఇంటి అడ్రస్ (హౌస్ నెంబర్ 8-2-293/82/జె/ఏ/118, జర్నలిస్టు కాలనీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -33, ఆంధ్రప్రదేశ్)నే అందులో ఆయన పేర్కొన్నారు. ఈ చిరునామాతోనే ఆయన దరఖాస్తు చేశారు కూడా. ఇక, పార్టీ అధ్యక్షుడిగా వైవీ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎస్.రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డి.శివశంకర్ ‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా టి.విశ్వనాథ రెడ్డి, కోశాధికారిగా కె.శ్రీనివాస్ నాయుడులను పేర్కొన్నారు. ఈ కార్యవర్గంతో ఈనెల పదో తేదీన పార్టీ పేరును రిజిస్టర్ చేయించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఆయన దరఖాస్తు చేశారు. అయితే, జగన్ అధ్యక్షుడిగా కాకుండా ఆయన సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డి పేరుతో ఈ దరఖాస్తు చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+