భాను కిరణ్ తో సింగనమల రమేష్ లింక్స్: ఏడున్నర కోట్ల వివాదం
వైజయంతి రెడ్డి అప్పును సింగనమల రమేష్ చెల్లించలేదు. దాంతో మహేశ్వరంలోని భూమిని రిజస్టేషన్ చేస్తానని రమేష్ హామీ ఇచ్చాడు. ఎన్ని సార్లు అడిగినా రిజిస్ట్రేషన్ చేయలేదు. 2009లో భానుతో కలిసి సింగనమల రమేష్ వైజయంతిరెడ్డిని బెదిరించాడు. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. దీంతో వైజయంతి రెడ్డి వెనక్కి తగ్గారు. ఇప్పుడు సూరి హత్య తర్వాత భాను కిరణ్ కోసం పోలీసులు వెతుకున్న స్థితిలో వైజయంతి రెడ్డి సిసిఎస్ పోలీసులకు సింగనమల రమేష్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.
Story first published: Monday, January 17, 2011, 14:09 [IST]