భాను కిరణ్ భూ దందాలపై సమగ్ర దర్యాప్తు: డిఎల్ రవీంద్రా రెడ్డి

DL Ravindra Reddy
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ భూదందాలపై వచ్చిన ఆరోపణల మీద సమగ్ర దర్యాప్తు చేయిస్తామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. భూమి కబ్జాలు, దందాలపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. భూ దందాలపై ఫిర్యాదులు అందుతున్నాయని, వైజయంతి రెడ్డి ఆరోపణలపై కూడా దర్యాప్తు జరుగుతుందని ఆయన చెప్పారు. రియల్టర్ మస్తాన్ రావు ఆత్మహత్య కేసును కూడా తిరిగి దర్యాప్తు చేయిస్తామని ఆయన చెప్పారు.

దర్యాప్తునకు ప్రత్యేకంగా డిజి స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించనున్నట్లు ఆయన తెలిపారు. భూదందాల్లో రాజకీయ, రౌడీ సంబంధాలు బయటపడుతున్నాయని, వాటిని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. భూదందాల్లో ఆర్థికంగా నష్టపోయినవారికి, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబసభ్యులకు తగిన సాయం కూడా అందిస్తామని ఆయన చెప్పారు. హింసను, నష్టాన్ని సరిదిద్దాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+