Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కావూరి ఇన్ పురంధేశ్వరి ఔట్?: కేబినెట్ విస్తరణ మూహూర్తం

Purandeswari
హైదరాబాద్: మరో రెండుమూడు రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాల నేపథ్యంలో మన రాష్ట్రం నుండి చాలామంది పార్లమెంటు సభ్యులు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణనుంచి ఇరుప్రాంతాలలోని సీనియర్ ఎంపీలు ఆశలపల్లకిలో ఉన్నారు. కొందరు లాబీయింగ్ కూడా చేస్తున్నట్టు సమాచారం. మంగళవారం ఉదయం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ సుదీర్ఘ చర్చలు జరిపారు. మన్మోహన్ అధికారిక నివాసానికి సోనియా వచ్చి చర్చలు జరిపారు. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తొలగించాలనే విషయమై చాలాసేపు చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ భారత్‌లోని అందరు ఎంపీలకు సంబంధించినది. కాబట్టి ఆ దిశలో విస్తరణ చేస్తూ మన రాష్ట్రంలో నెలకొన్న తెలంగాణ, మాజీ పార్లమెంటు వైఎస్ జగన్ సమస్యలను కూడా అధిగమించాలని అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

రాష్ట్రానికి ఇప్పుడు ఉన్న వాటికంటే ఒక మంత్రిపదవిని, మరో రెండు సహాయ మంత్రి పదవులను ఎక్కువగా ఇవ్వాలనే యోజనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన జైపాల్‌రెడ్డి ఒక్కరే పట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్నారు. పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, సాయిప్రతాప్, పల్లంరాజులు సహాయమంత్రులుగా ఉన్నారు. వీటికి తోడుగా మరో మూడు మంత్రి పదవులు (1+2) ఇచ్చే ఉద్దేశ్యంలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రి, సహాయ మంత్రి పదవులు సుమారు 70కి పైగా ఉంటాయి. రాష్ట్రంనుండి 32మంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రం రాష్ట్రానికి సరియైన ప్రధాన్యం ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం, జగన్ సమస్యల నేపథ్యంలో ఈమారు ఎపికి ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది.

సీమాంధ్రనుండి కావూరి సాంబశివరావు, కిషోర్ చంద్రదేవ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇక తెలంగాణ నుండి వి హనుమంతరావు, కేశవరావు, మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్‌లు ఉండగా అంజన్‌కుమార్ యాదవ్, సర్వే సత్యనారాయణ, మధుయాష్కీలు లాబీయింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంతమంది రేసులో ఉండటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అందుకే ఇప్పటి వరకు ఉన్న మంత్రులను కొందరిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో సమీకరణాలు మారే అవకాశం ఉంది. కేంద్ర మానవ వనరుల సహాయమంత్రి పురంధేశ్వరిని కేబినెట్ నుండి బయటకు పంపించే యత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

అయితే పురంధేశ్వరి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్టీఆర్ కూతురు కాబట్టి ఆమెను, ఆమె అభిమానులను సంతృప్తిపర్చడానికి రాష్ట్రంలో ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చే దిశలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సమస్యను పరిష్కరించడం కోసం రెండు సహాయ మంత్రి పదవులను ఇక్కడి వారికి ఇచ్చే ఉద్దేశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. బిసీ, బడుగులకు అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణవాదులపైకి వారిని ఎక్కుపెట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సీమాంధ్రలో జగన్‌ను ఎదుర్కొనే గట్టి వ్యక్తి లేకపోవడం అధిష్టానాన్ని ఆలోచింపజేస్తుంది. ఇటు అధిష్టానానికి అటు వైఎస్ కుటుంబానికి సన్నిహుతుడు అయిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జగన్‌ను ఎదుర్కొనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లో కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించాలనే యోచనలో ఉంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల్లో టెన్షన్ పెరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+