వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీకి ముడుపుల మాట అవాస్తవం: ఎంపీ హర్షకుమార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harsha Kumar
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ముడుపులు ఇచ్చారని ఆరోపిస్తున్న తెలంగాణ నేతలలో మాటల్లో ఎలాంటి నిజం లేదని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ కొట్టి పారేశారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులను లొంగదీసుకోవడానికి సీమాంధ్రులకు ఎలాంటి అవసరం లేదన్నారు. తెలంగాణకు చెందిన నేతలు కొందరు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కానీ ఆ వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని చెప్పారు.

ఈ నెల 20వ తారీఖున కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీలో సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులం శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్న వారు ఇప్పుడు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X