హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సి కళ్యాణ్, శింగనమల రమేష్ ఆస్తులపై ఐటి అధికారుల దృష్టి

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Kalyan
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడి భానుకిరణ్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నిర్మాతలు శింగనమల రమేష్, సి కళ్యాణ్ అస్తులపై ఐటి అధికారులు దృష్టి సారించారు. సదరు నిర్మాతలను విచారిస్తున్న సిసిఎస్ పోలీసు కార్యాలయానికి బుధవారం ఐటి అధికారులు వచ్చారు. నిర్మాతల ఆస్తుల వివరాలను సిసిఎస్ పోలీసులనుండి తీసుకోవడానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. వందల కోట్లు ఆస్తులు, పలు చోట్ల భూములు కలిగి ఉన్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఐటి అధికారులు వారి ఆస్తులపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.

సి కళ్యాణ్, శింగనమల రమేష్‌లతో పాటు సినిమాలలో చిన్నపాటి కమేడియన్‌గా నటించిన గణేష్ కూడా కోట్లాది రూపాయలతో సినిమా నిర్మాణాలు చేపట్టడంతో ఆయనకూ బానుతో లింకులు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి భాను కిరణ్‌తో టాలీవుడ్ లింకులు రోజుకోటి బయటకు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X