హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ సాక్షి మీడియా పెట్టుబడులపై నేను లేఖ రాయలేదు: శంకర రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో పెట్టుబడులపై తాను హైకోర్టుకు లేఖ రాసినట్లు వచ్చిన వార్తలను చేనేత మంత్రి శంకర రావు ఖండించారు. తాను హైకోర్టుకు లేఖ రాయలేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో వైయస్ జగన్ అక్రమాస్తులపై తాను ఎప్పుడైనా చర్చకు సిద్ధమేనని ఆయన అన్నారు.

తాను మంత్రి పదవి చేపట్టక ముందు వైయస్ జగన్ సాక్షి మీడియాలో పెట్టుబడులపై మాట్లాడానని, అతి కొద్ది కాలంలో జగన్ లక్ష కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడని తాను ఓ మీడియా సమావేశంలో అన్నానని, దాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఉంటుందని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుడు కెవిపి రామచందర్ రావు గానీ మరెవరైనా గానీ వస్తే జగన్ ఆస్తులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X