వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న?: వివియస్ లక్ష్మణ్‌కు పద్మశ్రీ

By Pratap
|
Google Oneindia TeluguNews

VVS Laxman-Sachin Tendulkar
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నకు సచిన్ టెండూల్కర్ ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. భారతరత్న అవార్డుకు సచిన్ టెండూల్కర్ పేరు సిఫార్సు చేశామని, కొద్ది రోజుల్లో ఫలితం వస్తుందని పార్లమెంటు సభ్యుడు సంజయ్ నిరుపమ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఆవార్డు తగినంత వయస్సు లేదనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. సచిన్ టెండూల్కర్ ఇప్పటికే పద్మ విభూషన్ అవార్డు అందుకున్నారు.

కాగా, 2010 సంవత్సరానికి గాను ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. హైదరాబాద్ స్టైలిష్ క్రికెటర్ వివియస్ లక్ష్మణ్‌కు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఈ అవార్డు ఆయనకు ఎప్పుడో రావాల్సిందని, ఇప్పుటికైనా రావడం సంతోషమని అంటున్నారు. కాగా, బాలీవుడ్ నటి వహెదా రెహ్మాన్, సంగీత దర్శకుడు ఖయ్యూం పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X