హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandra Babu Naidu
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు బుధవారం డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి రెండు రోజులు రైతు యాత్ర పేరిట గుంటూరు జిల్లాలో ఉన్న ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పేదరికం తొలగినప్పుడే భారతదేశం అగ్రస్థానంలో నిలబడుతుందన్నారు. భారతదేశం సుసంపన్న దేశం అనడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గాలని ఆయన ఆకాంక్షించారు.

స్వతంత్ర ఫలాలు అట్టడుగు వర్గాల వారికి అందినప్పుడే రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. భవిష్యత్తులో భారత్ ప్రపంచాన్ని శాసిస్తుందన్నారు. పేదోడి సొమ్మును రాజకీయ నాయకుడు దోచుకొని స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారన్నారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకు వస్తే దేశంలో ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఇవ్వవచ్చన్నారు. కానీ ప్రణబ్ ముఖర్జీ నల్లధనాన్ని వెలికితీసి దేశంలోనికి తేవడానికి చేతులు ఎత్తేశారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X