వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్లాక్మనీ పెద్దల గురించి చెప్పండి: కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
జాతి సంపదను కొల్లగొట్టి విదేశీ బ్యాంకుల్లో నిల్వ చేసుకున్న నల్లధనం అక్రమార్కులకు కేంద్రంలోని యూపీఏ సర్కారు కొమ్ము కాస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అగ్రనేత ఎల్కె అద్వానీ ఆరోపించారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం రూపంలో మగ్గుతున్న జాతి సంపదను తిరిగి వెనక్కి తెప్పించే అంశంలో ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. నల్లధనం వెలికి తీసే విషయంలో ప్రభుత్వం వద్ద దాచేందుకు ఏమీ లేకపోవచ్చు కానీ అదేసమయంలో తన వద్ద ఈ అంశంపై ఉన్న సమాచారాన్ని సైతం వెల్లడించేందుకు వెనుకంజ వేస్తోందన్నారు. రెండు మూడేళ్ల క్రితం తానీ అంశాన్ని ప్రస్తావించిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలూ దీనికి నల్లధన సమాచారం వెల్లడించేందుకు అన్ని పార్టీలు సమ్మతం తెలిపాయని ఆయన గుర్తు చేశారు.
Comments
Story first published: Thursday, January 27, 2011, 14:14 [IST]