వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్‌లో భద్రతా బలగాల చేతిలో 9 మంది మావోల హతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
రాంచీ: జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో శుక్రవారం తెల్లవారు జామున 9 మంది మావోయిస్టులు హతమయ్యారు. బర్వాదీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు తమకు గురువారం సాయంత్రం సమాచారం అందిందని, పోలీసులు వారిని చుట్టుముట్టి లొంగిపోవాలని అడిగారని, మాట వినకుండా మావోయిస్టులు కాల్పులు జరిపారని, దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని పోలీసు సూపరింటిండెంట్ కుల్దీప్ ద్వివేది చెప్పారు.

గురువారం సాయంత్రం ప్రారంభమైన ఎదురు కాల్పులు శుక్రవారం ఉదయం వరకు జరిగాయని ఆయన చెప్పారు. సంఘటనా స్థలం నుంచి 9 మంది మావోయిస్టుల మృతదేహాలను, పెద్దయెత్తున్న ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X