వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినీ నిర్మాతలు కళ్యాణ్, శింగనమల రమేష్‌లపై మరో ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

C Kalyan
హైదరాబాద్: తెలుగు సినీ నిర్మాతలు సింగనమల రమేష్ బాబు, సి.కళ్యాణ్‌లపై హైదరాబాద్ నేర పరిశోధక విభాగం (సీసీఎస్) అధికారులు మరో కేసు నమోదు చేశారు. షాలిమార్ వీడియోస్ అధినేత అష్రాఫ్ కుమారుడు అష్వాఖ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఇది నమోదైంది. అష్వాఖ్ యునెటైడ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. మహేష్‌బాబు హీరోగా నటించిన 'ఖలేజా" వీడియో రైట్స్ కోసం రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని కళ్యాణ్, శింగనమలలకు రూ. 32.25 లక్షలు చెల్లించాడు.

సినిమా హక్కులు ఇవ్వలేదు, డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో అష్వాఖ్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు కోసం వీరిద్దరిపై అష్వాఖ్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో నిరుడు ఆగస్టులో జూబ్లీహిల్స్‌లోని సి.కళ్యాణ్ కార్యాలయం బాలాజీ ల్యాబ్‌కు పిలిపించి బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు. మరోపక్క సూరి కేసు దర్యాప్తులో భాగంగా సీసీఎస్ అధికారులు గురువారం 'స్కిన్‌టచ్" సంస్థ యజమానిని ప్రశ్నించినట్లు సమాచారం.

కాగా, శింగనమల రమేష్ హైదరాబాదులోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణం కోసం 7.65 కోట్ల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడనే ఆరోపణలపై సిసిఎస్‌లో రమేష్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో రమేష్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X