నేటి నుంచి భారత మార్కెట్లో ఆపిల్ ఐప్యాడ్ విక్రయాలు
గత తొమ్మది నెలల క్రితం అమెరికాలో విడుదలైన ఐప్యాడ్ అతి తక్కువ సమయంలోనే దాదాపు 150 లక్షల ఐప్యాడ్లు అమ్ముడై రికార్డు సృష్టించాయి. భారత్లో ఆపిల్ ఐప్యాడ్ రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఒకటి వై-ఫై సదుపాయంతో, మరొకటి 3జీ+వై-ఫై సదుపాయాలలో ఇది లభ్యమవుతుంది. భారత్లో దీని ప్రారంభ ధర రూ. 27,990గా ఉంది. 3జీ+వై-ఫై వెర్షన్ ధర రూ. 34,900 నుంచి రూ. 44,900 మధ్య ఉంది. ఇకపోతే ఇది 16 జీబీ, 32 జీబీ, 64 జీబీ మెమరీ సామర్థ్యాలలో లభిస్తుంది.
ఇందులో మల్టీ టచ్ యూజర్ ఇంటర్ఫేస్, వెబ్ బ్రౌజింగ్, ఈ మెయిల్స్, ఫోటో షేరింగ్స్, హైడెఫినెషన్ వీడియోస్, మ్యూజిక్, గేమ్స్, ఈ-బుక్స్ వంటి ఎన్నో సదుపాయులు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) పోస్ట్-పెయిడ్ మరియు ప్రీ-పెయిడ్లలో రూ. 999లకు అపరిమిత యూసేజ్ (అన్లిమిటెడ్ యూసేజ్) ఐప్యాడ్ 3జీ డేటా ప్లాన్లను కూడా ప్రకటించింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. స్టాక్ ముగియక ముందే సమీప అవుట్లెట్కు వెళ్లి మీ ఆపిల్ ఐప్యాడ్ను సొంతం చేసుకోండి.