జగన్ సాక్షి మీడియాపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అలక
తనకు అధికార దాహం లేదని, ప్రజలు అవకాశం ఇస్తే సేవ చేస్తానని ఆయన చెప్పారు. ప్రజల కోసం పనిచేసే పార్టీలన్నీ తమకు మిత్రపక్షాలేనని ఆయన శుక్రవారం అనంతపురంలో అన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదిస్తే ఏం చేయాలనే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కాంగ్రెసుకు తాము మద్దతిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రాబోవని, ప్రజలు ఎన్నికల భారాన్ని కోరుకోవడం లేదని ఆయన అన్నారు. ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ఓ పత్రిక, ఓ చానెల్ తనను రాజకీయాల నుంచి తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్సించారు. ఇలాంటి విషయాలపై కన్నా బ్లాక్ మనీ, అవినీతిపై ఆ మీడియా దృష్టి పెడితే మంచిదని ఆయన సలహా ఇచ్చారు.
Comments
Story first published: Friday, January 28, 2011, 12:33 [IST]