హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస, బిజెపిలపై ధ్వజమెత్తిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపిలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కెసి తండాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో తెరాస మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఆయన శుక్రవారం సహనం కోల్పోయారు. తెరాస మహిళా కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలు చేశారు. వారిని పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. పాసులున్నవారిని మాత్రమే రచ్చబండ కార్యక్రమానికి అనుమతించినప్పటికీ ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ తప్పలేదు. శాసనసభలో ఒక పార్టీకి 11, మరో పార్టీకి 2 సీట్లు మాత్రమే ఉన్నాయని, ఆ పార్టీలకు చెందినవారే వచ్చిన గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన తెరాస, బిజెపిలను ఉద్దేశించి అన్నారు.

ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునే పార్టీలకు తిరిగి అవే సీట్లతో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. 40, 50 మంది వచ్చి భయపెడితే తాము భయపడబోమని ఆయన అన్నారు. కొంత మంది ఆందోళన చేస్తే బెదిరేది లేదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి రెచ్చిపోయి పరుష పదజాలం వాడారు. కాంగ్రెసుకు 125 ఏళ్ల చరిత్ర ఉందని, కొద్ది మంది వచ్చి ఆందోళనలు చేస్తే వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X