హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్ పులి హక్కులు ఎవరికీ అమ్మలేదు: నిర్మాత శింగనమల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Singanamala Ramesh
హైదరాబాద్: ఆరోగ్య కారణాలవల్లనే ముందస్తు బెయిలుని కోరినట్లు మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొన్న సినీ నిర్మాత శింగనమల రమేష్ శుక్రవారం చెప్పారు. తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగా లేదని అందుకే ముందస్తు బెయిలు కావాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించానన్నారు. తనపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన పులి చిత్రం వీడియో హక్కులను తాను ఎవరికీ అమ్మలేదన్నారు. పులి వీడియో హక్కులు అమ్మి డబ్బు తీసుకొని రైట్స్ ఇవ్వడం లేదనే విషయంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

ఆ రైట్స్ ఎవరికీ అమ్మలేదన్నారు. షాలిమార్ అధినేత అష్రాఫ్‌ది తప్పుడు ఫిర్యాదు అన్నారు. అసలు ఆయన పోలీసులకు చేసిన ఫిర్యాదులో నా పేరు లేదన్నారు. అయినప్పటికీ తనను పోలీసులు అక్రమంగా ఇరికించి వేధిస్తున్నారన్నారు. నాపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కాగా నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిలు కోరిన శింగనమల పిటిషన్‌ పరిశీలించాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కోర్టు నోటీసులు పంపించింది. ఈ కేసు విచారణను వచ్చే నెల 2వ తేదికి కోర్టు వాయిదా వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X