చిక్కుల్లో మహిళా ఐపిఎస్: తేజ్దీప్ ప్రాసిక్యూషన్కు అనుమతి
దీంతో ఆమెను వేధింపుల కేసులో ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫైలు సీఎం కార్యాలయానికి చేరింది. ఒకటి, రెండు రోజుల్లో దానికి సీఎం ఆమోదం కూడా లభించనుంది. కాగా ఇక్కడ మరో వివాదం తెరపైకి వచ్చింది. తేజ్దీప్ కౌర్ తనకు ఇష్టమైన వారిని సంతృప్తి పర్చడానికి అధికార దర్పాన్ని ప్రదర్శించి కమిషన్ ఆగ్రహానికి గురైతే, పరిహారాన్ని పోలీసు సంక్షేమ నిధి నుంచి చెల్లించడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ అంశం ఆ శాఖలో దుమారం రేపుతోంది. పోలీసు కుటుంబాలకు ఆసరా కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధి నుంచి ఏకంగా రూ. 4 లక్షలను ఆమె కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది.
తేజ్దీప్ కౌర్ అధికార విధుల నిర్వహణలో భాగంగా చేసిన చర్యకు ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందే కానీ, అమాయకులను వేధించి జరిమానాకు గురైతే ప్రభుత్వానికి ఏం సంబంధమనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక వేళ కమిషన్ ఆదేశాలు అలా ఉన్నా తమకు సంబంధం లేదని, ఉత్తర్వులు ఆమెకే ఇవ్వాలని కమిషన్ను మళ్లీ కోరి ఉండాల్సిందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ నిధి ఉద్దేశాలను దెబ్బతీసేలా ఆమె కోసం ఈ నిధిని ఖర్చు చేయడం తీవ్ర తప్పిదమేనని వారంటున్నారు. అయితే తాము చెల్లించిన మొత్తాని వసూలు చేస్తామని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి.