వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌పై సుప్రీంలో కేసు: సీమాంధ్ర వ్యాఖ్యలపై అడుసుమిల్లి పిటిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల సీమాంధ్ర ప్రజలపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై అడుసుమిల్లి జయప్రకాశ్ సుప్రీంకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీమాంధ్రులకు సిగ్గు లేదన్న వ్యాఖ్యలపై ఆయన పిటిషన్ వేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు. ఆయన వ్యాఖ్యలు జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. చట్ట వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయనను శిక్షించాలన్నారు.

కాగా కృష్ణా జిల్లాలో మరో న్యాయవాది కెసిఆర్‌పై మచిలీపట్టణం కోర్టులో కేసు వేసినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రులపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు చట్ట వ్యతిరేకమని శాంతిప్రసాద్ అనే లాయరు స్థానిక మచిలీపట్టణం కోర్టులో కేసి వేశారు. ఆయనపై 503ఏ, 503బి, 506 తదితర సెక్షన్‌లపై కేసు వేసినట్టుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X