హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియాతో చిరంజీవి భేటీ, అల్లు అరవింద్‌కు రాజ్యసభ సీటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి రేపో మాపో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తారా, విలీనం కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వానించడానికే రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ హైదరాబాదు వచ్చారని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య చెప్పారు. సోనియాను కలవాలని ఆంటోనీ చిరంజీవికి చెప్పారని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆంటోనీ, చిరంజీవి భేటీలో రహస్యమేమీ లేదని ఆయన అన్నారు. మంత్రివర్గంలో చేరే విషయంపై చర్చ జరగలేదని, రెండు పార్టీలున కలిసి పనిచేయాలని అనుకున్నామని ఆయన చెప్పారు.

కాగా, చిరంజీవి వెంటనే ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. రేపటి నుంచి చిరంజీవి తిరుపతి పర్యటన చేయాల్సి ఉంది. ఆ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. దీన్నిబట్టి ఆయన వెంటనే ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్‌ వర్గానికి చెందిన శాసనసభ్యులపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుని, చిరంజీవిని ప్రభుత్వంలో చేర్చుకుంటుందని అంటున్నారు. తొలి విడతగా జగన్ వర్గానికి చెందిన నలుగురైదుగురు శాసనసభ్యులపై వేటు పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన నలుగురైదుగురు శానససభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాగా, చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్‌కు రాజ్యసభ సీటు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. సి. రామచంద్రయ్య కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X