వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆందోళనలపైనే శ్రద్ధ, అభివృద్ధిపై లేదు చిత్తశుద్ధి: జయప్రకాష్ నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
విశాఖపట్నం: రాష్ట్రంలో ఉన్న పార్టీలు, పార్టీల నేతలు ఆందోళనలపై చూపుతున్న శ్రద్ధను అభివృద్ధిపై చూపడం లేదని లోక్‌సత్తా అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసనసభ సభ్యుడు జయప్రకాష్ నారాయణ సోమవారం విశాఖలో ఆరోపించారు. నేతలెవరూ అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో కన్నా అవినీతిలో ముందంజలో ఉందని అన్నారు. రాష్ట్రంలో ఓడరేవులు, షిప్పింగ్ యార్డుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పోతున్నాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఓడ రేవులకు, షిప్పింగ్ యార్డులకు ప్రాధాన్యత ఇవ్వక పోవడంతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. వాటిని వేరే రాష్ట్రాలు తన్నుకు పోతున్నాయన్నారు. రాష్ట్రంలోని చెరుకు రైతులకు ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించాలన్నారు. రైతులే దేశానికి వెన్నెముక అని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X