చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సొంత జిల్లాలోనే సిఎం కిరణ్ కుమార్‌కు చుక్కెదురు: బయటపడిన వర్గ విభేదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
చిత్తూరు: తన సొంత జిల్లా చిత్తూరులోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రచ్చబండలో చుక్కెదురైంది. ఆయన ముందే కాంగ్రెసు పార్టీలోని వర్గ విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి మాట వినకుండా శాసనసభ్యుడు సికె బాబు అలిగి వెళ్లిపోయారు. రెడ్డిగుంట క్రాస్ వద్ద విగ్రహావిష్కరణ సభ నుంచి సికె బాబు అర్థాంతరంగా వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి పిలిచినా పట్టించుకోకుండా ఆయన వెళ్లిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడిని ముఖ్యమంత్రి పలకరించడంతో సికె బాబుకు కోపం వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.

ఆదికేశవులునాయుడి ముఖ్యమంత్రి పలకరించడంపై సికె బాబు అభ్యంతరం చెప్పారు. అనుపల్లి గ్రామంలో రచ్చబండలో పాల్గొనకుండా సికె బాబు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి గల్లా అరుణ కుమారి పాల్గొన్నారు. మిగతా శాసనసభ్యులెవరూ ముఖ్యమంత్రి వెంట లేరని సమాచారం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, శాసనసభ్యురాలు కుతూహలమ్మ తదితర జిల్లా శాసనసభ్యులు కిరణ్ కుమార్ రెడ్డిపై ఆగ్రహంగా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X