తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతి కాటేజీలో మహిళ ఆత్మహత్య: గది రాము పేరిట కేటాయింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tirumala
చిత్తూరు: పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం కాటేజీలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తిరుమల హిల్‌వ్యూ కాటేజ్‌లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. కాటేజ్‌లోని 634వ గదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన మహిళ పక్కన ఆరునెలల శిశువు మృతదేహం కూడా ఉంది. శిశువు ఆ మహిళ బిడ్డగా భావిస్తున్నారు. అయితే వీరు హత్యకు గురయ్యారా, ఆత్మహత్య చేసుకున్నారా అనే విషయం ఇంకా తెలియలేదు. కాటేజిలో గదిని ఆదివారం సాయంత్రం 5 గంటలకు విజయనగరం జిల్లా ఆకులకట్ట గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి పేరుతో ఈ గది తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మృతదేహాలు గదిలోపల ఉండగా బయటకు తాళం వేసి ఉంది. దీంతో పోలీసులు హత్యగా కూడా భావిస్తున్నారు. అయితే కాటేజ్ సిబ్బంది గదినుండి ఎవరూ బయటకు రాకపోవటంతో వచ్చి కిటికీలోనుండి చూశారు. గదిలో మహిళ మృతదేహం కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గదిని తీసుకున్న రాము పరారీలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X