వైయస్ జగన్ పోలవరం పాదయాత్ర తేదీలు ఖరారు

జగన్ పాదయాత్ర ఫిబ్రవరి 7వ తేదిన 10.30 గంటలకు ఆత్రేయపురం నుండి ప్రారంభం కానుంది. పేరవరం, కొవ్వూరు తదితర గ్రామాలమీదుగా 8వ తేది, 9వ తేదిన పాదయాత్రతో 10వ తేదికి పోలవరానికి చేరుకుంటారు. అదేరోజు పోలవరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నాలుగు రోజులు సాగే ఈ పాదయాత్రలో 73 కిలోమీటర్లు ఉంటుంది.ఇందులో పాల్గొనమని చెప్పి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఎవరినీ కోరమని ఆలాగే ఇష్టం ఉన్న వారు పాల్గొనవచ్చునని జగన్ వర్గం పేర్కొంటుంది. జగన్ పాదయాత్రతో ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నీటి వసతిని కల్పిస్తుందని జగన్ వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications