అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్, వైయస్సార్ పాత్రలపై ఆనాడే చెప్పాం: పరిటాల కేసుపై చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
అనంతపురం: తమ పార్టీ నాయకుడు పరిటాల రవి హత్యలో దివంగతన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన కూమారుడు వైయస్ జగన్ పాత్ర ఉందని తాము ఆనాడే చెప్పామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు మంగళవారం ఉదయం అనంతపురం జిల్లాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పరిటాల హత్య కేసులో ఏ విధమైన పురోగతి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిటాల రవి హత్య కేసులో నిందితులను ఒక్కొరొక్కరనే చంపుకుంటూ పోతున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రాన్ని కాంగ్రెసు కుక్కలు చింపిన విస్తరిలా చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు గణనీయంగా తగ్గాయని, ఈ విషయంలో బీహార్ కన్నా రాష్ట్రం వెనకబడిపోయిందని, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు గుజరాత్‌కు తరలిపోతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెసు తీరు వల్లనే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు తరలిపోతున్నాయని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా రైతులు 800 కోట్ల రూపాయల విలువ చేసే పంట నష్టపోయారని ఆయన చెప్పారు. బీమా పథకం కింద వేయి కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, కానీ ప్రభుత్వం నిర్లక్యం వల్ల 200 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X