చిరంజీవితో కాంగ్రెసు పొత్తు ప్రతిపాదనపై దామోదర్ రెడ్డి ఫైర్

R Damodar Reddy
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో పొత్తు పెట్టుకోవాలనే తమ పార్టీ అధిష్టానం ప్రతిపాదనపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెసుకు మెజారిటీ ఉండగా చిరంజీవితో పొత్తు ఎందుకని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. చిరంజీవితో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. పార్టీ స్థాపించినప్పుడు కాంగ్రెసుపై తీవ్రంగా దుమ్మెత్తిపోసిన చిరంజీవి ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చిరంజీవితో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో కాంగ్రెసుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు.

పార్టీకి నష్టం జరగకుండా ఉండాలంటే చిరంజీవి మద్దతు తీసుకోవద్దని ఆయన అన్నారు. సమైక్యవాది అయిన చిరంజీవి వల్ల తెలంగాణలో కాంగ్రెసుకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు పార్టీ ఈ ప్రాంతంలో భూస్థాపితమవుతుందని ఆయన అన్నారు. సమైక్యవాది చిరంజీవితో ఎలా స్నేహం చేస్తారని ఆయన పార్టీ అధిష్టానాన్ని అడిగారు. తెలంగాణలో కాంగ్రెసు నేతలు తిరగలేని స్థితిలో చిరంజీవి సహకారం తీసుకుని తప్పు చేస్తోందని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తే అభ్యంతరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇతర పార్టీలను విమర్సించడం మానుకుని ఉద్యమంపై దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+