హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూబ్లీహిల్స్‌ని చూపిస్తే సరిపోదు, పాతబస్తీ అభివృద్ధి చెందాలి: సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాజధానిలో ఉన్న జూబ్లీహిల్సు, బంజారాహిల్సులను అభివృద్ధి చేశామని చెప్పుకుంటే సరిపోదని, పాతబస్తీని అభివృద్ధి చేసినప్పుడే ప్రభుత్వం చెప్పుకోవచ్చునని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం రచ్చబండ కార్యక్రమంలో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ ఉదయం పాతబస్తీలోని అసిఫ్‌నగర్‌లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాతబస్తీ అభివృద్ధితోనే హైదరాబాద్‌ను సుందరనగరంగా తయారు చేసుకోవచ్చన్నారు. పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందని చెప్పారు. వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మహిళలకు పావలా వడ్డీ రుణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిందన్నారు. లబ్ధిదారులకు వారం రోజుల్లో పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు, అధికారులకు సూచించారు. కాగా రచ్చబండలో పాల్గొన్న వారిని ముఖ్యమంత్రి పథకాల అమలు తీరుపై అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X