హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవిపై శోభారాణి అలక: పిలుపు వస్తుందని వెయిటింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shobha Rani
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ మహిళా విభాగం కార్యవర్గ సభ్యురాలు, ఫైర్‌బ్రాండ్ శోభారాణి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెస్‌తో దోస్తీపై చర్చించేందుకు తనను పిలవక పోవడం పట్ల అసంతృప్తి వెలిబుచ్చారు. ప్రజారాజ్యం పార్టీ సభ్యురాలుగా పార్టీకి సేవలు అందించానని, అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తు, విలీనం వంటి కీలక చర్చల సమయంలో తనను పిలవక పోవడంపై అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. అయితే తనను చిరంజీవి పిలుస్తారనే ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తనను ఎందుకు పిలవలేదో తనకు తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు అయినా, విలీనానికి అయినా పార్టీ భవిష్యత్తు దృష్ట్యా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాను ప్రకటించానని చెప్పారు.

గత కొద్దికాలంగా నేను పార్టీకి దూరంగా ఉన్న వార్తల్లో నిజం లేదన్నారు. పార్టీ పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. అయితే పార్టీయే తనపట్ల అసంతృప్తిగా ఉందేమే అనే అనుమానం వ్యక్తం చేశారు. తనను ఇప్పటికైనా చిరంజీవి పిలవకుంటే నేరుగా వెళ్లి అడుగుతానని చెప్పారు. సినిమా నిర్మించే విషయం ఆలోచించలేదన్నారు. అయినా ప్రతి ఒక్కరికి వృత్తి, ప్రవృత్తి అనేవి ఉంటాయని, తన వృత్తి - ప్రవృత్తి కూడా పార్టీయేనన్నారు. కాంగ్రెస్‌లో విలీనంపై తాను ఇప్పుడే ఏమీ స్పందించనని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X