వైయస్ జగన్ మళ్లీ వస్తారు, కెసిఆర్ కాంగ్రెసులో కలుస్తారు: లగడపాటి

రాజకీయ అవగాహన లేకనే చిరంజీవి ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని, రాజకీయ అవగాహనతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారని ఆయన అన్నారు. రెండేళ్ల ప్రయత్న ఫలితంగా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం అయిందని, చిరంజీవిలో మార్పు వచ్చి విలీనానికి అంగీకరించారని ఆయన అన్నారు. చిరంజీవిలో వచ్చిన మార్పు తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనూ రావాలని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఏదో జాతీయ పార్టీలో విలీనం చేయాలని ఆయన సూచించారు. చిరంజీవిలో వచ్చిన మార్పు వస్తే చంద్రబాబును, కెసిఆర్ను కాంగ్రెసులో చేర్చుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనపై రెండో ఎస్సార్సీయే కాంగ్రెసు పార్టీ విధానమని ఆయన చెప్పారు.
Comments
లగడపాటి రాజగోపాల్ కాంగ్రెసు చిరంజీవి చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ విజయవాడ lagadapati rajagopal congress chiranjeevi chandrababu naidu ys jagan vijayawada
English summary
Congress Vijayawada MP Lagadapati Rajagopal hped that Ex MP YS Jagan will rejoin his party by 2014 election. He also said that, KCR will merge TRS in Congress. He suggested Chandrababu to merge Telugudesam party one of the National Parties. He opposed regional parties existence, as they will provocate people on regional basis.
Story first published: Tuesday, February 8, 2011, 14:28 [IST]