తెలంగాణలో ప్రస్తుత పరిస్థుతుల పాపం కేంద్రానిది: ఎర్రబెల్లి

శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా ప్రత్యేక తెలంగాణ ప్రకటించాలని ఆయన అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు కానుక అంటూ తెలంగాణ ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకూ ఆ మాటను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చుకోలేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రకటించాలన్నారు. తెలంగాణ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తెలంగాణ జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆరోపించారు. 400 మందికి పైగా విద్యార్థులు చనిపోవడానికి కారణం కూడా కేంద్రం అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్ను ఈడ్చుతామని చెప్పిన టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఇప్పుడు మాట్లాడటం లేదు అని అన్నారు.












Click it and Unblock the Notifications