సహాయ నిరాకరణ, 13నుండి ఆందోళనలు: జెఏసి చైర్మన్ కోదండరామ్

ఆ తర్వాత 15న జైల్ భరో నిర్వహిస్తామన్నారు. 16న ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామన్నారు. 19న రాస్తారోకోలు, 20న ఎన్హెచ్-9 రహదారీని దిగ్బంధం చేస్తామని చెప్పారు. 22 నుండి జెఏసి బంద్ ఉంటుందని చెప్పారు. సహాయ నిరాకరణలో కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సహాయ నిరాకరణలో భాగంగా బస్సులో టిక్కెట్లు తీసుకోక పోవడం, టోల్ గేట్లు, ఇంటి పన్నులు చెల్లించక పోవడం, జనాభా లెక్కలను బహిష్కరించడం తదితర కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications