రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజమండ్రిలో ఈ నెల 28వ తేదీన చిరంజీవి సభ, నాగబాబు హాజరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
రాజమండ్రి: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులోని విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చిరంజీవి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ బహిరంగ సభలో చిరంజీవి పాల్గొంటారా, లేదా అనేది తెలియడం లేదు. అయితే, చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు ఈ సభకు హాజరవుతారని తెలుస్తోంది. అభిమానులను, కార్యకర్తలను విలీనానికి సుముఖం చేసే ఉద్దేశ్యంతో ఈ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇటీవల చిరంజీవి హైదరాబాదులో అభిమానులతో సమావేశమైన విషయం తెలిసిందే. వివిధ వర్గాలతో చిరంజీవి విలీనంపై చర్చలు జరుపుతున్నారు. తాజాగా శనివారం చిరంజీవి కాపునాడు నాయకులతో హైదరాబాదులో చర్చలు జరిపారు. విలీనానికి కనీసం 45 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చిరంజీవి ఈ మధ్య కాలంలో చెప్పారు. శానససభా సమావేశాలు ముగిసిన తర్వాతనే విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ శాసనసభా పక్ష నేతగా చిరంజీవి ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు.

English summary
It is learnt that Chiranjeevi decided to organise public meeting at Rajahmundry of East Godavari district on February 28. Chiranjeevi's brother Nagababu may attend this public meeting. Kapunadu leaders met Chiranjeevi today in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X