హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రకటన సభకు తోట తరణి సెట్టింగ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రకటన బహిరంగ సభను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి సెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మార్చి మాసంలో జగన్ తన పార్టీ పేరును ప్రకటించేందుకు ఏర్పాటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అందరిలా సాదాసీదాగా కాకుండా ఓ మంచి సెట్ ద్వారా భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ పేరును ప్రకటించే ఉద్దేశ్యంతో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా జగన్ సినీ ఆర్డ్ డైరెక్టర్ తోట తరణిని ఈ సెట్ కోసం తీసుకున్నట్టు సమాచారం.

గతంలో మహేశ్‌బాబు అర్జున్ చిత్రానికి మధుర మీనాక్షి ఆలయ సెట్‌ను తోట తరణి వేశారు. తోట తరణి వేసిన ఆ సెట్‌లు నిజమైన మధుర మీనాక్షీ దేవాలయానికి ఏమాత్రం తీసిపోకుండా సెట్ చేసిన ఆయన కళాత్మకత అందరినీ ఆకట్టుకున్నది. సినిమాలకు కాకుండా ఇప్పుడు ఆయన జగన్ పార్టీ ప్రకటన వేదికకోసం సెట్ వేయడం విశేషం. ఈ వేదిక ఏర్పాటను మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇడుపులపాయలో ఇది ముస్తాబవుతోంది.

English summary
Jagan's New Party Announcement Stage to be designed by well known Cine art director Thota Tharan. He was erected 
 
 the Madhura Meenakshi set worth 3 crores for Mahesh Babu Arjun film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X