వైయస్ జగన్ తన పార్టీ గురించి ఆలోచించుకోవాలి: మంత్రి ఆనం
Districts
oi-Srinivas G
By Srinivas
తిరుపతి: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ గురించి ఆలోచించుకుంటే మంచిదని ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఆయనకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను అమలు పరుచడంలో విఫమవుతుందని జగన్ ఆరోపించారు. దీనిపై మంత్రి ఆనం స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలను కొట్టి పారేశారు. ఆయన ప్రభుత్వం గురించి కాకుండా ఆయన పార్టీ గురించి ఆలోచించుకోవాలన్నారు.
దివంగత వైయస్ ప్రవేశ పెట్టిన అన్ని పథకాలు కొనసాగుతున్నాయని, అలాగే కొనసాగుతాయని చెప్పారు. పథకాలకు నిధుల కొరత లేదని చెప్పారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యల్లో అర్థం లేదన్నారు.
Minister Anam Ramanarayana Reddy suggested Ex Member of Parliament YS Jaganmohan Reddy to rethink about his Party. Aanam condemned YS Jagan comments on YS schemes on Monday in Tirupati.