చిరు సొంత న్యాయం, వైయస్ అవినీతి వారసుడు జగన్: చంద్రబాబు

Chandrababu Naidu
కడప: సామాజిక న్యాయం పేరుతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రెండున్నరేళ్లకే సినిమా పూర్తి చేసిన పెద్ద చిరంజీవి తన సొంత న్యాయం కోసం కాంగ్రెసు గూటికి చేరారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఆయన సోమవారం కడప జిల్లాలోని సింహాద్రిపురంలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్నారన్నారు. పులివెందుల నియోజకవర్గంలో జలయజ్ఞం కోసమంటూ వెయ్యికోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దండుకున్నారన్నారు. అప్పుల్లో ఉన్న వైయస్ కుటుంబం కోట్లకు ఎలా పడగెత్తిందని ప్రశ్నించారు.

వైయస్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి సంచుల కొద్దీ డబ్బుల మూటలు పంపించారన్నారు. వైయస్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. వైయస్ అవినీతికి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వారసుడన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటే పార్టీ పెట్టే వాడు కాదని చెప్పారు. జలయజ్ఞం పేరుతో 60వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆరు ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. వైయస్‌తో సహా ఆయన అనుచరులు చాలా నిధులు అంతా మింగారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే నగదు బదిలీ పథకం అమలు చేస్తామన్నారు.

రైతులను, చేనేత కార్మికులను నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. ప్రభుత్వానికి పాలించడం చేతకాకుండే తప్పుకోవాలని సూచించారు. రైతుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రలను మోసం చేస్తే క్షమించమని చెప్పారు. రాష్ట్రంలో పనికి మాలిన ప్రభుత్వం ఉందని ఆరోపించారు. వైయస్ కుటుంబం వల్ల కడప జిల్లాలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే టిడిపి ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+