చిరంజీవికి గుడ్ బై, వైయస్ జగన్ వెంట జ్యోతుల నెహ్రూ

Jyothula Nehru
కాకినాడ: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. వైయస్ జగన్ నాయకత్వంలో నడుస్తానని ఆయన ప్రకటించారు. ఆదివారం జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలోని తన స్వగృహంలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సమక్షంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యకర్తల కోరిక మేరకు జగన్ ఏర్పాటు చేయనున్న పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. జగ్గంపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో జగన్ సమక్షంలో పార్టీలో చేరతానన్నారు. తనతోపాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, సామర్లకోట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అత్తిలి సీతారామస్వామి తదితరులు కూడా చేరతారని జ్యోతుల వెల్లడించారు.

జగన్ పార్టీని జిల్లాలో పటిష్టపరిచేందుకు తనతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు రానున్నట్టు చెప్పారు. తమ నాయకుని ఆదేశాల మేరకు జ్యోతులను తమ వర్గంలోకి ఆహ్వానించినట్టు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. జ్యోతుల రాకతో మెట్ట ప్రాంతంతో పాటు జిల్లాలో జగన్ పార్టీ పటిష్టమవుతుందని ధీమా వ్యక్తంచేశారు. జగన్‌తో చర్చించిన తర్వాత జగ్గంపేటలో ఎప్పుడు బహిరంగ సభ నిర్వహించేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ప్రత్తిపాడు ఎంపీపీ వరుపుల రాజా, అడ్డతీగల ఎంపీపీ అనంత ఉదయ భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+