మార్చిలోనే పార్టీని వైయస్సార్ సమాధి వద్ద ప్రకటిస్తా: వైయస్ జగన్

సోమవారం ఆయన బద్వేల్లో సభలో మాట్లాడారు. త్వరలోనే వైఎస్ఆర్ స్వర్ణయుగం వస్తుందన్నారు. ఆ పాలన ముప్పయి ఏళ్లపాటు కొనసాగుతుందని జగన్ తెలిపారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ పాదాల చెంత మార్చిలోపేదల పార్టీ ఆవిర్భవిస్తుందన్నారు. పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పేర వైయస్ జగన్ తన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications