టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కయ్యాయి: ధ్వజమెత్తిన వైయస్ జగన్

YS Jagan
కడప: ఫీజు రీయింబర్స్‌మెంటు, పావలా వడ్డీ, ఆరోగ్య శ్రీ, రూ.2 బియ్యం లాంటి పేదల సంక్షేమ పథకాలతో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అయితే పేదల స్మృతిపథం నుంచి ఆయన్ను చెరిపేయడానికి కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై దివంగత నేతపై బురదజల్లుతున్నాయని దుయ్యబట్టారు. వైయస్ ప్రవేశపెట్టిన పథకాలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయని ఈ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే.. వైఎస్ కలలుగన్న మరో ప్రపంచం ఏమైపోతోందన్న బాధను ఆయన వ్యక్తం చేశారు. జగన్ ఆదివారం వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు.

ప్రతి పేద విద్యార్థీ ఉచితంగా పెద్ద చదువులు చదువుకోవాలని ఎన్నో కలలుగన్న వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ప్రారంభించారని, మహానేత మరణించాక ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు చూపించినా..ఒక్క రూపాయీ విడుదల చేయలేదని అధికారులు చెబుతుంటే తనకు చాలా బాధనిపించిందని ఆయన అన్నారు. ప్రతి అక్కా, చెల్లీ లక్షాధికారులు కావాలని దివంగత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పావలా వడ్డీకి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అధికారులు చెబుతుంటే వైఎస్ కలలుగన్న మరో ప్రపంచం ఏమైపోతుందా అని నాకు చాలా చాలా బాధనిపించిందని ఆయన అన్నారు. ఉన్న పథకాలకు నిధులివ్వట్లేదు సరికదా రచ్చబండ అని ఓ కార్యక్రమం పెట్టి ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+