చిరంజీవి సినిమా అయిపోయింది, ఆయన గురించి ఎందుకు: చంద్రబాబు
దేశంలో కూడా అవినీతిపై చైతన్యం వస్తుందన్నారు. ప్రజలంతా ఏకమై ఉద్యమిస్తే అవినీతిపరులు కోట్టుకు పోతారన్నారు. టిడిపి కార్యకర్తలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు. గతంలో వైయస్ కూడా టిడిపి నేతలపై అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూశారన్నారు. టిడిపి 17 సంవత్సరాలు అధికారంలో ఉందని, కానీ అవినీతికి మాత్రం దూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజల ఆస్తులను కాపాడాటానికి పోరాడితే కూడా కేసులు పెడతారన్నారు. కడప ఉప ఎన్నికలలో టిడిపి విజయం సాధిస్తుందన్నారు. అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తామని చెప్పారు. మాజీ ఎంపీ జగన్ అనుచరులు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందుతుడి భానుకిరణ్తో సంబంధాలు పెట్టుకొని కడప జిల్లాను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.
Comments
చంద్రబాబు నాయుడు వైయస్ రాజశేఖర రెడ్డి వైయస్ జగన్ భాను కిరణ్ చిరంజీవి కడప chandrababu naidu ys rajasekhar reddy ys jagan bhanu kiran chiranjeevi kadapa
English summary
Megastar Chiranjeevi cinema was completed, so we do not need to talk about him, Said TDP president Chandrababu Naidu today in Kadapa district Rythu Kosam Yatra. He also blamed YS Rajasekhar Reddy, former chief Minister for booking illegal cases against his opponents.
Story first published: Tuesday, February 15, 2011, 10:41 [IST]