చిరంజీవి సినిమా అయిపోయింది, ఆయన గురించి ఎందుకు: చంద్రబాబు

దేశంలో కూడా అవినీతిపై చైతన్యం వస్తుందన్నారు. ప్రజలంతా ఏకమై ఉద్యమిస్తే అవినీతిపరులు కోట్టుకు పోతారన్నారు. టిడిపి కార్యకర్తలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు. గతంలో వైయస్ కూడా టిడిపి నేతలపై అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూశారన్నారు. టిడిపి 17 సంవత్సరాలు అధికారంలో ఉందని, కానీ అవినీతికి మాత్రం దూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజల ఆస్తులను కాపాడాటానికి పోరాడితే కూడా కేసులు పెడతారన్నారు. కడప ఉప ఎన్నికలలో టిడిపి విజయం సాధిస్తుందన్నారు. అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తామని చెప్పారు. మాజీ ఎంపీ జగన్ అనుచరులు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందుతుడి భానుకిరణ్తో సంబంధాలు పెట్టుకొని కడప జిల్లాను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications