హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మధు యాష్కీపై కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavitha
హైదరాబాద్ : నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మధుయాష్కీలాంటి నేతలు తెలంగాణ ఉద్యమాన్ని వాడుకునే విధంగా మాట్లాడుతున్నారే కానీ కార్యాచరణలో చిత్తశుద్ధి చూపటం లేదని ఆమె అన్నారు. బుధవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలన్న ప్రధానమంత్రి ప్రకటన తర్వాతనైనా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 'మా తెలుగుతల్లి"కి గీతాన్ని రాష్ట్రీయగీతంగా ఆమోదిస్తే తెలంగాణ ప్రజలు ప్రతిఘటిస్తారని కవిత పేర్కొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే తెలంగాణ మొత్తం తిరగబడుతుందని ఆమె హెచ్చరించారు.

English summary
Telangana Jagruthi president and KCR daughter Kalwakuntla Kavitha expressed anguish at Congress Nizamabad MP Madhu Yashki. She criticised that leaders like Madhu yashki are talking more, doing nothing to achieve statehood for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X