అసెంబ్లీ బహిష్కరణ సరి కాదు: తెలంగాణ ఎమ్మెల్యేల పట్టుపై మనీష్ తివారీ

Manish Tiwari
న్యూఢిల్లీ: తెలంగాణకు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఢిల్లీ నుంచి వెళ్లబోమని, శాసనసభా సమావేశాల కన్నా తమకు తెలంగాణ ముఖ్యమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు చేసిన వ్యాఖ్యలపై ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ బుధవారం ప్రతిస్పందించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తామని శాసనసభ్యులు అనడం సరైంది కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ సమస్యకు అంత తొందరగా పరిష్కారం లభించదని ఆయన అన్నారు. సుదీర్ఘమైన తెలంగాణ సమస్యకు ఇంత తొందరగా పరిష్కారం లభించిందని ఆయన అన్నారు.

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ఎంతో ప్రగతి సాధించిందని ఆయన అన్నారు. తెలంగాణపై ఓపికతో వ్యవహరిస్తే మంచిదని ఆయన అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తున్నామని, జఠిలమైన తెలంగాణ సమస్యకు ఏకాభిప్రాయ సాధన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+