వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మేం పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం: మన్మోహన్ సింగ్
ఆర్థిక మాంద్యాన్ని తట్టుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వృద్ధిరేటు సాధించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. పలు విషయాల్లో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం అభివృద్ధికి ఆటంకంగా మారిందని, దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, ఈ ఏడాది అంతానికి ఫలితం సాధించగలమని ఆయన చెప్పారు. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి అదుపులోనే ఉందని, ఆ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కబడుతున్నాయని ఆయన అన్నారు. భారతదేశంలో పరిస్థితులు చక్కబడుతున్నాయని ఆయన అన్నారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపైనే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.
Comments
English summary
Prime Minister Manmohan Singh claimed his government is transparent in all aspects. He urged opposition to allow Parliament session to run smoothly. He answered the questions posed by media in TV Live show.
Story first published: Wednesday, February 16, 2011, 11:27 [IST]