మేం పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం: మన్మోహన్ సింగ్

ఆర్థిక మాంద్యాన్ని తట్టుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వృద్ధిరేటు సాధించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. పలు విషయాల్లో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం అభివృద్ధికి ఆటంకంగా మారిందని, దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, ఈ ఏడాది అంతానికి ఫలితం సాధించగలమని ఆయన చెప్పారు. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి అదుపులోనే ఉందని, ఆ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కబడుతున్నాయని ఆయన అన్నారు. భారతదేశంలో పరిస్థితులు చక్కబడుతున్నాయని ఆయన అన్నారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపైనే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.












Click it and Unblock the Notifications