హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వెంట వెళ్లేవారి జాబితా పంపాలని డిఎస్‌ను అడిగిన మొయిలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట వెళ్తున్నవారి జాబితా పంపాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను అడిగారు. జిల్లాలవారీగా జాబితా పంపాలని ఆయన శ్రీనివాస్‌ను అడిగినట్లు సమాచారం. మొయిలీ మంగళవారంనాడు డిఎస్‌కు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. జగన్ వెంట ఎవరెవరు వెళ్తున్నవారి గురించి ఆరా తీశారు. ఇప్పటికే ఎఐసిసి సభ్యుల జాబితా నుంచి జగన్ వెంట వెళ్లినవారి పేర్లను తొలగించారు.

పీసీసీలో కీలక పదవిలో ఉంటూనే జగన్ శిబిరం తరఫున ప్రతిరోజూ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలు పలువురు ఉన్నారు. ఇది పార్టీశ్రేణులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో పీసీసీలో బాధ్యతలు నిర్వర్తిస్తూ జగన్‌వైపు వెళ్లిన వారి వివరాలను జిల్లాలవారీగా ఇవ్వాలని డీఎస్‌ను మొయిలీ కోరారు. దీంతో, సమాచార సేకరణలో పీసీసీ నిమగ్నమైంది. రాష్ట్రంలో నిలిచిపోయిన సంస్థాగత ఎన్నికలపైనా పీసీసీ దృష్టిసారించింది. జగన్ ప్రభావం పార్టీలో లేనందున ఈ ప్రక్రియను కొనసాగించేందుకు పీసీసీ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంగళవారం డీఎస్ సంస్థాగత ఎన్నికల అంశాన్ని ప్రస్తావించడంలో ప్రధాన ఉద్దేశం ఇదేనని పార్టీనేతలు అంటున్నారు.

English summary
Congress AP affairs in charge Veerappa Moily asked PCC president D Srinivas to send the list of the leaders, who are supporting YS Jagan. Veerappa Moily called yesterday and asked about the leaders who are going with YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X