హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ విషయంలో మరోసారి కాంగ్రెసు మోసం: నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలద్వారా స్పష్టం అవుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం ఆరోపించారు. అయితే మరోసారి మోసపోవడానికి తెలంగాణ ప్రజలు ఎంతమాత్రం సిద్ధంగా లేరన్నారు. ప్రధానమంత్రినుండి తెలంగాణపై స్పష్టమైన హామీ వచ్చే వరకు తెలంగాణకు చెందిన కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీనుండి రావద్దని సూచించారు.

కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే అసెంబ్లీ సజావుగా సాగనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సహాయ నిరాకరణలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూర్తిగా పాల్గొంటారని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ వాదం వినిపించడానికి ప్లోర్ కో ఆర్డినేషన్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. తెలంగాణ తప్ప మరే ఇతర ప్రత్యామ్నాయం మాకు అవసరం లేదన్నారు.

English summary
Central Government is trying to cheat again Telangana people, said Telugudesam Party leader Nagam Janardhan Reddy. He condemned Prime Minister Manmohan Singh comments on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X